Team India | దుబాయ్: భారత క్రికెట్ జట్టు తమ సత్తా ఏంటో చూపెట్టింది. సమిష్టి ప్రదర్శన కనబరుస్తూ మూడు ఫార్మాట్లలో నంబర్వన్ జట్టుగా అవతరించింది. ఆదివారం ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో టెస్టులు, వన్డేలు, టీ20ల్లో టీమ్ఇండియా అగ్రస్థానాన్ని అధిష్టించింది. ఇంగ్లండ్తో ఐదు టెస్టుల సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవడం ద్వారా భారత్ తమ టాప్ ర్యాంక్ను మరింత పటిష్టం చేసుకుంది. ఇంగ్లండ్తో ఆఖరిదైన ధర్మశాల టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలువడం ద్వారా 122 రేటింగ్ పాయింట్లతో నంబర్వన్ ర్యాంక్లో కొనసాగుతున్నది.
ఆస్ట్రేలియా (117), ఇంగ్లండ్ (111), న్యూజిలాండ్ (101) వరుసగా రెండు, మూడు, నాలుగు ర్యాంక్ల్లో ఉన్నాయి. మరోవైపు వన్డేల్లో భారత్ 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (118) ఆ తర్వా త ర్యాంక్లో ఉంది. టీ20ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే..266 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ (256), ఆస్ట్రేలియా (255) వరుసగా రెండు, మూడు ర్యాంక్ల్లో ఉన్నాయి.