హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్-4లో టీమ్ అల్ఫా సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో టీమ్ అల్ఫా 45-35తో రఫ్ రైడర్స్పై అద్భుత విజయం సాధించింది. మరో క్వార్టర్స్లో సమా ఏంజెల్స్ 80-0తో టూటోరూట్పై గెలిచి టోర్నీలో ముందంజ వేసింది.
ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మరో పోరులో విల్లాజియో హైల్యాండర్స్ 50-30తో మావెరిక్స్ను ఓడించింది. హైల్యాండర్స్ కెప్టెన్ నిఖిల్ మాథూర్ తన ఆఖరి షాట్ ద్వారా జట్టు విజయంలో కీలకమయ్యాడు. సెమీస్లో డీఎస్ఆర్-సమా ఏంజెల్స్, టీమ్ అల్ఫా-హైల్యాండర్స్ మధ్య పోరు జరుగనుంది.