న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం టాటా గ్రూప్.. ఐపీఎల్లో అడుగుపెట్టనున్నది. ప్రస్తుతం లీగ్కు స్పాన్సర్గా వ్యవహరిస్తున్న చైనా మొబైల్ తయారీ సంస్థ వీవో వైదొలగనుండటంతో.. వచ్చే రెండేండ్లకు గానూ టాటా గ్రూప్ ఐపీఎల్ స్పాన్సర్గా వ్యవహరించనుందని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ మంగళవారం తెలిపాడు. ‘శతాబ్ద కాలంగా విశ్వవ్యాప్తంగా వందకు పైగా దేశాల్లో వ్యాపారాలు కొనసాగిస్తున్న టాటా గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరించనుండటం.. బీసీసీఐకి, ఐపీఎల్కు ప్రత్యేకమైన సందర్భం’ అని బోర్డు కార్యదర్శి జై షా పేర్కొన్నాడు.