బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తమిళ్ తలైవాస్ రెండో విజయం నమోదు చేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో తమిళ్ తలైవాస్ 39-33తో యూపీ యోధాపై విజయం సాధించింది. తలైవాస్ తరఫున మన్జీత్ (7), అజింక్యా (6), సాగర్ (5) సత్తాచాటగా.. యూపీ యోధా తరఫున సురేందర్ గిల్ (14) ఒంటరి పోరాటం చేశాడు. స్టార్ రైడర్ పర్దీప్ నర్వాల్ (6) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడం యూపీ విజయావకాశాలను దెబ్బతీసింది. యూ ముంబా, హర్యానా స్టీలర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 24-24తో ‘డ్రా’గా ముగిసింది.