జైపూర్: దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు, హిమాచల్ప్రదేశ్ ఫైనల్కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్లో తమిళనాడు 2 వికెట్ల తేడాతో సౌరాష్ట్రపై విజయం సాధించగా.. హిమాచల్ ప్రదేశ్ 77 పరుగుల తేడాతో సర్వీసెస్ను చిత్తుచేసింది. తమిళనాడుతో పోరులో మొదట బ్యాటింగ్కు దిగిన సౌరాష్ట్ర 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. షెల్డన్ జాక్సన్ (134; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) శతక్కొట్టగా.. విశ్వరాజ్ (52), అర్పిత్ (57) అర్ధశతకాలు నమోదు చేశారు. లక్ష్యఛేదనలో తమిళనాడు సరిగ్గా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. ఓపెనర్ బాబా అపరాజిత్ (122; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టగా.. ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (70), బాబా ఇంద్రజిత్ (50) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు.