కాబూల్: అఫ్గానిస్థాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెట్ భవిష్యత్పై సందిగ్ధత నెలకొన్నది. ఐసీసీ ఖరారు చేసిన షెడ్యూల్ మ్యాచ్లు ఆడేందుకు తాము అంతరాయం కల్గించబోమని తాలిబన్లు బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. భవిష్యత్లో అన్ని దేశాలతో మేము మెరుగైన సంబంధాలు ఏర్పరుచుకోవాలనుకుంటున్నట్లు తాలిబన్ సాంస్కృతిక కమిషన్ డిప్యూటీ హెడ్ అహ్మదుల్లా వసీఖ్ స్పష్టం చేశాడు. మరోవైపు నవంబర్లో అఫ్గానిస్థాన్తో జరిగే చరిత్రాత్మక టెస్టు మ్యాచ్ కోసం ఏర్పాట్లు ప్రారంభించామని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) తెలిపింది.