జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో బంగారు పతకం సాధించిన జోడీలో ఒకరైన ఆకుల శ్రీజ ఈ బృందంలో ఉన్నారు. ఆమెతోపాటు వరుణి జైస్వాల్, నిఖత్ బాను, జి. ప్రణీత, మోనికా మనోహర్ ఉన్నారు. సూరత్ వేదికగా జరిగిన 36వ నేషనల్ గేమ్స్లో ఈ బృందం మూడో స్థానంలో నిలిచింది.
బెంగాల్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో తెలంగాణ బృందం 0-3 తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడో స్థానానికే పరిమితమైంది. సుతీర్థ చేతిలో వరుణి 0-3 తేడాతో ఓడగా.. అహ్యికా ముఖర్జీ చేతిలో 3-2 తేడాతో శ్రీజ ఓటమిపాలైంది. నిఖత్ బాను కూడా పోరాడినప్పటికీ 2-3 తేడాతో మౌమా చేతిలో ఓటమి చవిచూసింది.