న్యూఢిల్లీ: బ్యాంకాక్లో జరుగుతున్న ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత టేబుల్ టెన్నిస్ స్టార్ మనికా బాత్రా అరుదైన ఘనత సాధించింది. ఆ టోర్నీలో భాగంగా జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో చైనీస్ తైపీకి చెందిన క్రీడాకారిణి చెన్ జూ యూపై 4-3 తేడాతో విజయం సాధించడం ద్వారా మనికా సెమీఫైనల్లోకి ప్రవేశించింది.
దాంతో ఆసియాకప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్స్కు చేరిన భారతదేశపు మొదటి మహిళా ప్లేయర్గా మనికా గుర్తింపు పొందింది. కొరియాకు చెందని జియోన్ జిహీ, జపాన్కు చెందిన మిమా ఇటో మధ్య మరో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఆ మ్యాచ్లో గెలిచిన క్రీడాకారిణితో మనికా బాత్రా సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది.