టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశకు చేరుకునేందుకు జట్లన్నీ చాలా కష్టపడుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం నాడు జరిగిన మ్యాచ్లో జింబాబ్వేపై వెస్టిండీస్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ జట్టు జాన్సన్ చార్లెస్ (45), రావ్మెన్ పావెల్ (28), అకీల్ హొస్సేన్ (23 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 153/7 స్కోరు చేసింది.
మిగతా బ్యాటర్లు కైల్ మేయర్స్ (13), ఎవిన్ లూయిస్ (15), నికోలస్ పూరన్ (7), షామ్రా బ్రూక్స్ (0), జేసన్ హోల్డర్ (4) నిరాశపరిచారు. లక్ష్య ఛేదనలో జింబాబ్వే ఆటగాళ్లు ఈ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఆరంభంలో వెస్లీ మెధెవెరె (27), చివర్లో ల్యూక్ జాంగ్వే (29) మాత్రమే రాణించారు.
రెగీస్ చకాబ్వా (13), టోనీ మున్యోంగా (2), సీన్ విలియమ్స్ (1), సికందర్ రజా (14), మిల్టన్ షూంబా (2), ర్యాన్ బర్ల్ (17), రిచర్డ్ ఎన్గార్వా (2), టెండాయ్ చతారా (3) ఎవరూ పెద్దగా రాణించలేదు. దీంతో ఆ జట్టు 18.2 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 4, హోల్డర్ 3 వికెట్లతో చెలరేగారు. అకీల్ హొస్సేన్, ఓబెడ్ మెకాయ్, ఒడియన్ స్మిత్ తలో వికెట్ తీసుకున్నారు.