T20 World Cup | ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన ఇషాన్ కిషన్ అనూహ్యంగా టీ20 ప్రపంచకప్ ఆడే భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత టీమిండియాకు అత్యంత కీలకమైన న్యూజిల్యాండ్ మ్యాచ్లో రోహిత్ శర్మ స్థానంలో అతన్ని ఓపెనర్గా దింపగా విఫలమయ్యాడు.
అతనితోపాటు మిగతా ఆటగాళ్లు కూడా ఫెయిలవడంతో ఆ మ్యాచ్లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరకుండానే టీమిండియా ఇంటిదారి పట్టడంలో ఆ ఓటమిది ముఖ్యమైన పాత్ర. ఆదివారం జరిగిన ఆఫ్ఘనిస్థాన్, న్యూజిల్యాండ్ మ్యాచ్ ఫలితంతో భారత జట్టు సెమీస్ ఆశలన్నీ ఆవిరైపోయాయి.
సోమవారం నాడు నామమాత్రపు పోరులో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ఒక సలహా ఇచ్చాడు. ఈ మ్యాచ్లో ఇషాన్ కిషన్ను ఓపెనర్గా పంపాలని సూచించాడు. ‘పవర్ ప్లేలో ఉండే ఫీల్డింగ్ నిబంధనలను ఇషాన్ చక్కగా ఉపయోగించుకుంటాడు. తనదైన క్రికెట్ ఆడతాడు. నమీబియాపై అతన్ని ఓపెనర్గా దింపితే బాగుంటుంది’ అని లక్ష్మణ్ చెప్పాడు.