టీ20 ప్రపంచకప్లో రౌండ్-1 మ్యాచులు ముగిశాయి. ఆడిన మూడు మ్యాచుల్లో రెండేసి విజయాలు సాధించిన శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్.. ఈ టోర్నీ రెండో దశకు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, ఐర్లాండ్ ముందడుగు వేయగా.. నమీబియా, యూఏఈ ఇంటి దారిపట్టాయి.
అదే సమయంలో గ్రూప్-బీ నుంచి జింబాబ్వే, ఐర్లాండ్ ముందడుగు వేయగా.. వెస్టిండీస్, స్కాట్లాండ్ ఇంటిదారి పట్టాయి. ఈ దశలో అనూహ్యంగా వెస్టిండీస్ నిష్క్రమిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇలా గ్రూప్-1 దశ పోటీలు ముగియడంతో.. సూపర్-12లో పోటీపడే జట్లు ఖరారయ్యాయి. ఈ దశలో గ్రూప్-1లో ఆరు జట్లు, గ్రూప్-2లో ఆరు జట్లు పోటీ పడతాయి.
గ్రూప్-1 జట్లు: అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిల్యాండ్, శ్రీలంక
గ్రూప్-2 జట్లు: బంగ్లాదేశ్, ఇండియా, నెదర్లాండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా, జింబాబ్వే.