టీ 20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్ జట్టుకి సెమీస్ బెర్త్ ఖరారు అయింది. దాంతో సెమీస్కి చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సూపర్-12 స్టేజ్లో గ్రూప్-1 లో ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది న్యూజిలాండ్. అఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేయడంతో నెట్ రన్రేట్తో సంబంధం లేకుండా న్యూజిలాండ్ సెమీస్ చేరింది. న్యూజిలాండ్ సూపర్ 12 స్టేజీలో ఆడిన చివరి గ్రూప్ మ్యాచ్లో 35 పరుగుల తేడాతో ఐర్లాండ్పై గెలిచింది. న్యూజిలాండ్ టీం ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింటిలో గెలిచింది, ఒకటి ఓడిపోయింది, ఒక మ్యాచ్ వర్షం కారణంగా డ్రా అయింది.
మూడు జట్ల మధ్య సెమీస్ పోటీ
ప్రస్తుతం గ్రూప్-1లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అయితే, సెమీస్ బెర్త్ కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక జట్ల మధ్య పోటీ నెలకొంది. అఫ్గానిస్థాన్పై 105 పరుగుల తేడాతే గెలిస్తే, ఆస్ట్రేలియా జట్టు రన్రేట్లో ఇంగ్లాండ్ని వెనక్కి నెట్టే అవకాశం ఉంది. దాంతో, ఆ జట్టు సెమీస్ చేరే అవకాశం ఉంది. ఒకవేళ అలాజరగకుంటే నవంబర్ 5న శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితాన్ని బట్టి సెమీస్ చేరే రెండో జట్టు ఏదనేది తెలుస్తుంది.