T20 World Cup : పొట్టి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్. ఓపెనర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధానా పాకిస్థాన్తో జరగనున్న కీలక మ్యాచ్కు దూరం కానుంది. వేలికి గాయం కారణంగా మంధాన ఆడటం లేదని సమాచారం. ‘ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా మంధాన గాయపడింది. అయితే.. ఆమె మొత్తానికే వరల్డ్ కప్ టోర్నీకి దూరం కానుందా? అనేది ఇప్పుడే చెప్పలేం. అయితే.. పాకిస్థాన్ మ్యాచ్కు మాత్రం తాను అందుబాటులో ఉండదు’ అని ఐసీసీ తెలిపింది.
గ్రూప్ – బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆదివారం (ఫిబ్రవరి 12న) వరల్డ్ కప్ తొలి పోరులో తలపడనున్నాయి. ఓపెనర్గా శుభారంభం అందించే మంధాన తొలి మ్యాచ్ ఆడకపోవడం భారత్ను కలవర పెడుతోంది. అయితే. వెస్టిండీస్తో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్కు మంధాన అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది.
ఆస్ట్రేలియాతో సోమవారం జరిగిన వామప్ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తుండగా మంధాన గాయపడింది. ఆమె ఎడమచేతి మధ్య వేలికి గాయం అయింది. దాంతో, బంగ్గాదేశ్తో బుధవారం జరిగిన రెండో వామప్ మ్యాచ్కు మంధాన దూరమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కూడా ఫిట్నెస్ సమస్య ఎదుర్కొంటోంది. ఈమధ్యే దక్షిణాఫ్రికాలో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్లో హర్మన్ప్రీత్ భుజానికి గాయం అయింది. అయితే.. ‘నా శరీరం ఇప్పుడు బాగానే ఉంది. విశ్రాంతి తీసుకోవడం వల్ల ఇబ్బందిగా అనిపించడం’ లేదు అని హర్మన్ తెలిపింది.