న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం టీమ్ఇండియాను ఎంపిక చేసింది. గాయాల నుంచి కోలుకుంటున్న జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరామం లేని క్రికెట్తో బుమ్రాకు వెన్నెముక గాయం కాగా, హర్షల్ పటేల్ పక్కటెముకల గాయానికి గురయ్యాడు. మెగాటోర్నీ నాటికి ఈ ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్నెస్ కోసం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందనున్నారు.
తనదైన మార్క్ యార్కర్లు వేయడంలో బుమ్రా సిద్ధహస్తుడైతే…ఆఖరి ఓవర్లలో పరుగులు నియంత్రించడంలో హర్షల్ది అందవేసిన చేయి. ఒకవేళ టీ20 ప్రపంచకప్ నాటికి హర్షల్ పూర్తి ఫిట్నెస్ దక్కించుకోకపోతే యువ బౌలర్ అవేశ్ఖాన్కు అవకాశం దక్కవచ్చు. భువనేశ్వర్ కుమార్, అర్ష్దీప్సింగ్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్ బౌలింగ్ బాధ్యతలు మోయనున్నారు. ఆసియాకప్లో యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ మెరుగ్గా రాణించినా..సెలెక్టర్లు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ వైపే మొగ్గుచూపారు. బ్యాటింగ్ విషయానికొస్తే పెద్దగా మార్పులేమి లేవు. దీపక్ హుడాకు జట్టులో చోటు దక్కగా, హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. స్టాండ్బైగా షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, దీపక్ చాహర్ ఎంపికయ్యారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో సిరీస్ల ద్వారా బౌలింగ్ కూర్పును పరిశీలించనున్నారు. హార్దిక్, అర్ష్దీప్సింగ్, భువనేశ్వర్ పని ఒత్తిడిని ఎన్సీఏలో సమీక్షించనున్నారు.
టీ20 ప్రపంచకప్ జట్టు: రోహిత్(కెప్టెన్), రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, హార్దిక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్దీప్సింగ్. స్టాండ్బై: షమీ, శ్రేయాస్ అయ్యర్, రవి బిష్ణోయ్, చాహర్.
ఆస్ట్రేలియాతో సిరీస్కు: రోహిత్(కెప్టెన్), రాహుల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, హార్దిక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్, షమీ, హర్షల్, చాహర్, బుమ్రా
దక్షిణాఫ్రికాతో సిరీస్కు: రోహిత్(కెప్టెన్), రాహుల్ (వైస్ కెప్టెన్), కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, కార్తీక్, అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్, అర్ష్దీప్సింగ్, షమీ, హర్షల్ పటేల్, చాహర్, బుమ్రా