దుబాయ్: ఈ నెల 17 నుంచి యూఏఈ, ఓమన్ వేదికగా ప్రారంభం కానున్న టీ20 వరల్డ్కప్లో 24న పాకిస్థాన్తో టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ విజేతకు రూ.12 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. రన్నరప్ జట్టుకు రూ.6 కోట్లు, సెమీఫైనల్స్లో ఓడిన టీమ్లకు రూ.3 కోట్లు అందించనున్నట్లు ఐసీసీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ మెగాటోర్నీ నుంచి డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)ను అమలు చేయనున్నట్లు ప్రకటించిన ఐసీసీ.. మ్యాచ్ మధ్య రెండు డ్రింక్స్ బ్రేక్లకు అవకాశమిచ్చింది. రెండు నిమిషాల 30 సెకన్ల పాటు ఉండే ఈ విరామాల వల్ల ప్రకటనదారులకు అదనపు లబ్ధి చేకూరనుంది. పురుషుల టీ20 ప్రపంచకప్లో డీఆర్ఎస్ అమలు చేయడం ఇదే తొలిసారి కాగా.. మహిళల విభాగంలో 2018 నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు.