T20 World Cup | టీ20 వరల్డ్ కప్లో భాగంగా సెమీ ఫైనల్లో అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్తో టీమ్ ఇండియా తలపడనున్నది. ఈ మ్యాచ్కు ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. హిట్మ్యాన్ కుడి చేయికి గాయమైందని సమాచారం. అయితే, గాయం తీవ్రమైందన్న వివరాలు తెలియరాలేదు. ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డ వెంటనే రోహిత్ శర్మ బ్యాటింగ్ను నిలిపివేశాడు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఫొటోలు కుడి చేయికి గాయం కాగా.. ఐస్ ప్యాక్తో మర్దన చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. తీవ్రమైన నొప్పితోనే బాధపడుతున్నట్లు స్పష్టమవుతుంది. గాయంపై ఇప్పటి వరకు జట్టు గానీ, బీసీసీఐ గానీ ప్రకటన చేయలేదు. 10న ఇంగ్లండ్తో జరిగే కీలక మ్యాచ్కు హిట్మ్యాన్ అందుబాటులో ఉంటాడా? లేదా? అన్నది తెలియాల్సి ఉన్నది.