కైరో: ప్రతిష్ఠాత్మక ఐఎస్ఎస్ఎఫ్ చాంపియన్షిప్లో భారత యువ షూటర్ ఇషాసింగ్ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే మూడు పతకాలు దక్కించుకున్న ఈ హైదరాబాదీ షూటర్ శనివారం జరిగిన 10మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ జూనియర్ ఈవెంట్లో రాణా సామ్రాట్తో జతకట్టి పసిడి పతక పోరులో 17-15తో భారత్కే చెందిన శిఖా నార్వల్, సాగర్ దంగీ జోడీపై విజయం సాధించింది.
క్వాలిఫికేషన్ దశ నుంచే తమదైన జోరు కనబరిచిన ఇషా, రాణా ఎక్కడా వెనుకకు తగ్గకుండా రౌండ్ రౌండ్కు మెరుగైన ప్రదర్శన కనబరిచింది. మరోవైపు పురుషుల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో స్వప్నిల్ కుశాల్ నాలుగో స్థానంలో నిలిచి పారిస్ ఒలింపిక్స్కు బెర్తు దక్కించుకున్నాడు.