Team India | ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడనున్న టీ20 సిరీస్కు సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్లో ఒకరు టీమ్ఇండియాకు సారథ్యం వహించనున్నారు. వరల్డ్కప్ తర్వాత ఆసీస్తో భారత జట్టు ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుండగా.. దానికి సూర్యుకుమార్, రుతురాజ్లో ఒకరు టీమ్ఇండియాకు నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండేది అనుమానంగా మారడంతో ఈ ఇద్దరిలో ఒకరికి సారథ్య బాధ్యతలు అప్పగించాలని టీమ్ మేనేజ్మెంట్ యోచిస్తున్నది. వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో పాండ్యాకు మరింత విశ్రాంతి అవసరమని బోర్డు భావిస్తున్నది.
‘హార్దిక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే మైదానంలో అడుగు పెడతాడు. వన్డే ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడ్డ అతడు మెగాటోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. ఆసీస్తో సిరీస్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పడం కష్టమే. అయితే అతడిని తొందరపాటులో గ్రౌండ్లోకి దింపాలనుకోవడం లేదు. అతడి గాయం గురించి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) వైద్యులు చెప్పిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని బీసీసీఐ అధికారి తెలిపారు. దీంతో ప్రస్తుతం భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సూర్యకుమార్కు కెప్టెన్గా అవకాశం దక్కొచ్చు.
ఆసియా క్రీడల్లో భారత జట్టుకు స్వర్ణం అందించిన రుతురాజ్ గైక్వాడ్ కూడా పోటీలో ఉన్నాడు. ప్రస్తుతం ప్రపంచకప్లో దుమ్మురేపుతున్న సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కంగారూలతో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోవడం ఖాయమే కాగా.. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. బౌలింగ్ విభాగంలో బుమ్రా, షమీ, సిరాజ్కు కూడా రెస్ట్ ఇవ్వనుండటంతో అవేశ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్ పోటీలో ముందు వరుసలో నిలువనున్నారు. ఇక దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విజృంభిస్తున్న సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్కు కూడా పిలుపు వచ్చే అవకాశం ఉంది.