Surya Kumar Yadav : టీ20 క్రికెట్లో ప్రపంచ నంబర్ వన్(World No1)గా కొనసాగుతున్న భారత మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) వన్డేల్లోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. పొట్టి ఫార్మాట్లో తన చిత్రవిచిత్ర విన్యాసాలతో, భారీ షాట్లతో అలరించే సూర్య వన్డేల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఐపీఎల్తో పాటు అంతర్జాతీయ టీ20ల్లో.. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్(Ab De Villiers )ను తలపించే సూర్య.. 50 ఓవర్ల ఫార్మాట్లో మాత్రం అదే జోరు కొనసాగించలేకపోతున్నాడు. అయినా అతడిపై నమ్మకముంచిన సెలెక్షన్ కమిటీ ఆసియాకప్ పోటీలకు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘వన్డేల్లోను సత్తా చాటగలననే నమ్మకముంది. నా వరకైతే బలంగా విశ్వసిస్తున్నా. ఈ అంశం గురించి కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)తో మాట్లాడా. రోహిత్ శర్మ, కోహ్లీతోనూ తరచూ వన్డేల్లో రాణించడం గురించి మాట్లాడుతూ ఉంటా. వన్డేల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ఎలాంటి ఆటతీరు ఉండాలనే విషయంలో వారి సలహాలు తీసుకుంటున్నా. ఆసియా కప్(Asia Cup 2023)లో దాని ఫలితం చూస్తారు’ అని సూర్యకుమార్ తెలిపాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో సూర్య స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
ఇప్పటి వరకు 53 టీ20లు ఆడిన సూర్యకుమార్ 46.02 సగటుతో 1841 పరుగులు చేశాడు. ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడి ఈ ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్గా ఎదిగాడు. ఇక వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే 26 మ్యాచ్ల్లో కేవలం 24.33 సగటుతో 511 రన్స్ చేశాడంతే. వన్డేల్లో మెరుగైన యావరేజ్ ఉన్న సంజూ శాంసన్(Sanju Samson)ను సూర్యను ఎంపిక చేయడం విమర్శలకు దారితీసింది. అయినా కూడా. ఆసియా కప్లో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్కు బ్యాకప్గానే శాంసన్ను తీసుకున్నారు.