ముంబై: ఐపీఎల్ 15వ సీజన్లో తొలి రెండు పరాజయాల తర్వాత గెలుపు బాట పట్టిన సన్రైజర్స్ హైదరాబాద్.. సోమవారం మరో కీలక పోరుకు సిద్ధమైంది. లీగ్లో అడుగుపెట్టిన మొదటి సీజన్లోనే ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న గుజరాత్ టైటాన్స్తో నేడు విలియమ్సన్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. చెన్నైపై విజయంతో హైదరాబాద్ జట్టులో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుండగా.. పంజాబ్తో పోరులో చివరి రెండు బంతులకు రెండు సిక్సర్లు కొట్టాల్సిన ఉత్కంఠ స్థితిలోనూ గెలుపొందిన గుజరాత్ తిరుగులేకుండా కనిపిస్తున్నది. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి ఫామ్లోకి రావడం రైజర్స్కు కలిసొచ్చే అంశం కాగా.. ప్రత్యర్థి జట్టులో బలమైన హిట్టర్లు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ బ్యాటింగ్ యూనిట్కు కఠిన పరీక్ష ఎదురవనుంది. గత మ్యాచ్లో విలియమ్సన్ ఫర్వాలేదనిపించినా.. అవసరమైనంత వేగంగా ఆడలేకపోయాడని అంగీకరించక తప్పదు. మార్కరమ్, పూరన్ స్కోరు పెంచే బాధ్యత తీసుకుంటే.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాల్సిన అవసరముంది. బౌలింగ్లో భువనేశ్వర్, నటరాజన్, సుందర్, ఉమ్రాన్ కీలకం కానున్నారు. చాన్నాళ్లుగా సన్రైజర్స్ జట్టులో ప్రధాన ఆటగాడిగా కొనసాగిన రషీద్ ఖాన్ తొలిసారి హైదరాబాద్కు ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. నెట్స్లో రషీద్ బంతులను ఎదుర్కొన్న అనుభవం ఉన్న మన ప్లేయర్లు ప్రధాన మ్యాచ్లో ఈ స్టార్ స్పిన్నర్ను ఎలా ఆడుతారో చూడాలి!
తుది జట్లు (అంచనా)
హైదరాబాద్: విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్, త్రిపాఠి, మార్క్మ్,్ర పూరన్, సమద్/శశాంక్, సుందర్, భువనేశ్వర్, జాన్సెన్, ఉమ్రాన్, నటరాజన్.
గుజరాత్: హార్దిక్ (కెప్టెన్), వేడ్, గిల్, సుదర్శన్, మిల్లర్, తెవాటియా, మనోహర్, రషీద్ ఖాన్, దర్శన్, షమీ, ఫెర్గూసన్.