Sumit Nagalf : భారత టెన్నిస్ యువకెరటం సుమిత్ నగాల్(Sumit Nagal) కెరీర్లో మరో ఘనత సాధించాడు. ప్రస్తుతం ఫ్రెంచ్ ఓపెన్కు సిద్ధమవుతున్న అతడు పురుషుల సింగిల్స్లో వింబుల్డన్ (Wimbledon) మెయిన్ డ్రాకు అర్హత సాధించాడు. గడిచిన ఐదేండ్లలో ఈ గ్రాండ్స్లామ్ మెయిన్ డ్రాకు క్వాలిఫై అయిన తొలి భారతీయుడిగా నగాల్ చరిత్ర సృష్టించాడు.
నగాల్ కంటే ముందు ప్రజ్నేష్ గున్నేశ్వరన్(Prajnesh Gunneshwaran) 2019లో వింబుల్డన్ టోర్నీకి అర్హత సాధించాడు. అయితే.. కెనడాకు చెందిన మిలొస్ రౌనిక్ చేతిలో 6-7, 6-2, 2-6తో ఓడిపోయాడు. ఆ తర్వాత పలువురు ఎంతో ప్రయత్నించినా విజయం సాధించలేదు. గత ఏడాది కాలంగా అద్భత విజయాలతో వార్తల్లో నిలుస్తున్న నగాల్ ఐదేండ్ల నిరీక్షణకు తెరదించాడు. వింబుల్డన్ టోర్నీ జూలై 1 నుంచి ప్రారంభం కానుంది.
Solid practice before Roland Garros
Thank you, @DjokerNole 💪🏽 pic.twitter.com/lNa2pbz1Ih
— Sumit Nagal (@nagalsumit) May 21, 2024
ఈ ఏడాది ఆరంభం నుంచి నగాల్ సంచలనాలకు కేరాఫ్ అయ్యాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) మెయిన్ డ్రాకు అర్హత సాధించిన అతడు రెండో రౌండ్కు దూసుకెళ్లి రికార్డులు నెలకొల్పాడు. ప్రస్తుతం ఈ యంగ్స్టర్ ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ ఓపెన్లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. మే 26 నుంచి జూన్ 9 వరకూ ఈ టోర్నీ జరుగనుంది.