Asian Games | ఆసియా క్రీడల్లో ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గట్లే చక్కటి ప్రదర్శనతో చాంపియన్గా నిలిచింది. సోమవారం జరిగిన ఫైనల్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. 19 పరుగుల తేడాతో శ్రీలంకను మట్టికరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. స్టార్ ఓపెనర్ స్మృతి మందన (46; 4 ఫోర్లు, ఒక సిక్సర్), జెమీమా రోడ్రిగ్స్ (42; 5 ఫోర్లు) రాణించగా.. షఫాలీ వర్మ (9), రిచా ఘోష (9), హర్మన్ప్రీత్ (2), పూజ వస్ర్తాకర్ (2) విఫలమయ్యారు.
లంక బౌలర్లలో ప్రభోధిని, సుగంధిక, ఇనోక తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనతరం లక్ష్యఛేదనలో లంక 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 97 పరుగులకే పరిమితమైంది. హాసిని (25) టాప్ స్కోరర్ కాగా.. యువ పేసర్ టీటాస్ సధు 4 ఓవర్లలో కేవలం 6 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది. రాజేశ్వరి గైక్వాడ్ కూడా రెండు వికెట్లు తీసింది. దీంతో లంకకు రజత పతకం దక్కగా.. మూడో స్థానం కోసం జరిగిన పోరులో పాకిస్థాన్ను ఓడించిన బంగ్లాదేశ్ కాంస్యం ఖాతాలో వేసుకుంది.
భారత్: 116/7 (స్మృతి 46, జెమీమా 42; ప్రబోధిని 2/16, ఇనోక 2/21),
శ్రీలంక: 97/8 (హాసిని 25; టిటాస్ 3/6, రాజేశ్వరి 2/20).
అత్యుత్తమ ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగాం. స్వర్ణం సాధించాలని కలలు కన్నాం. ఈ క్రమంలో ప్రపంచ రికార్డు స్కోరు బద్దలు కొట్టాం. చైనాను ఓడించి టాప్లో నిలువడం అంటే ఆషామాషీ కాదు. ఈ ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నాం’
-రుద్రాంక్ష్