Steve Smith : ప్రపంచంలోని మేటి బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్ తన బెస్ట్ ఇన్నింగ్స్ గురించి చెప్పాడు. 2015 వరల్డ్ కప్ సెమీఫైనల్లో టీమిండియాపై ఆడిన ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమని ఈ స్టార్ ప్లేయర్ తెలిపాడు. ఐసీసీ ఈవెంట్స్లో మీ బెస్ట్ ఇన్నింగ్స్ ఏది? అని అడగగా.. 2015 వరల్డ్కప్లో సిడ్నీ స్టేడియంలో భారత్పై కొట్టిన సెంచరీ (93 బంతుల్లో105 పరుగులు) ఇప్పటివరకూ తన కెరీర్లో బెస్ట్ అని స్మిత్ చెప్పుకొచ్చాడు.
స్మిత్ శతకంతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఆ మ్యాచ్లో ఆసీస్ 95 పరుగులతో టీమిండియాపై గెలుపొందింది. ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి విశ్వ విజేతగా నిలిచింది.
Steve Smith names his best ICC & Ashes moments on Instagram Q & A session. pic.twitter.com/6L5sg9GniU
— CricTracker (@Cricketracker) April 10, 2023
బాల్ ట్యాంపరింగ్ వివాదం స్మిత్ కెరీర్ను మలుపు తిప్పింది. దాంతో, అతను కెప్టెన్సీ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆటగాడిగా కొనసాగిన అతను దక్షిణాఫ్రికా సిరీస్లో చెలరేగాడు. బిగ్బాష్ లీగ్లోనూ వరుసగా రెండు శతకాలు బాదాడు. అంతేకాదు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో(Border – Gavaskar Trophy) కెప్టెన్గా సత్తా చాటాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో ఆఖరి రెండు టెస్టులకు అతడు సారథిగా ఎంపికయ్యాడు. మూడో టెస్టులో చురుకైన కెప్టెన్సీతో జట్టును గెలిపించాడు. దాంతో, ఆసీస్ పోటీలో నిలిచింది. అయితే.. ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో టీమిండియా 2-1తో సిరీస్ సొంతం చేసుకుంది. మళ్లీ ఇరుజట్లు ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో తలపడనున్నాయి. జూన్ 7 – 11 తేదీల్లో ఇంగ్లండ్లోని ఓవల్ స్టేడియం వేదిక డబ్ల్యూటీసీ టైటిల్ పోరు జరగనుంది. 2021లో ఫైనల్ చేరిన భారత్ అనూమ్యంగా న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.