హైదరాబాద్, ఆట ప్రతినిధి: గ్రీస్ వేదికగా సెప్టెంబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక ప్రపంచ బధిర టెన్నిస్ చాంపియన్షిప్నకు రాష్ట్ర యువ ప్లేయర్ భవానీ కేడియా ఎంపికైంది. మెగాటోర్నీ కోసం త్రివేడ్రంలో జరిగిన సెలెక్షన్స్లో భవాని సత్తాచాటింది. మహిళల సింగిల్స్ సెమీస్లో భవాని 6-4, 6-4తో క్రితి లాటాపై అద్భుత విజయం సాధించింది. గతేడాది బ్రెజిల్ డెఫ్ ఒలింపిక్స్లో డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో నాలుగో స్థానంలో నిలిచిన భవాని ఈసారి కచ్చితంగా పతకం గెలువాలన్న పట్టుదలతో ఉంది. టెన్నిస్లో నిలకడగా రాణిస్తున్న భవాని.. సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసుకుంది.
ప్రపంచ చాంపియన్షిప్ జట్టు వివరాలు
పృథ్వీ శేఖర్, ధనంజయ దూబే, శివాజీ, అర్షిత్, జాఫ్రిన్ షేక్, భవానీ కేడియా