హైదరాబాద్, ఆట ప్రతినిధి: నిర్మల్ వేదికగా జరిగిన తొమ్మిదవ రాష్ట్రస్థాయి మహిళల సీనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్షిప్లో నిజామాబాద్ విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ పోరులో నిజామాబాద్ 1-0 తేడాతో సిద్దిపేటపై అద్భుత విజయం సాధించింది. మూడు రోజుల పాటు జరిగిన టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన ప్లేయర్లు తమ సత్తాచాటారు. మొత్తంగా 14 స్వర్ణాలు, 6 రజత పతకాలు సొంతం చేసుకున్నారు. అంతకుముందు జరిగిన వేర్వేరు సెమీఫైనల్స్లో సిద్దిపేట 4-0తో హైదరాబాద్పై గెలువగా, నిజామాబాద్ 7-0తో కామారెడ్డిని చిత్తుగా ఓడించింది.