హైదరాబాద్, ఆట ప్రతినిధి: బెంగళూరులో జరుగుతున్న ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన శ్రీవల్లి రష్మిక ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్లో రష్మిక 6-2, 6-1తో లాల్న తరారుదీ(థాయ్లాండ్)పై అలవోక విజయం సాధించింది. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన రష్మిక వరుస సెట్లలో ప్రత్యర్థిని మట్టికరిపించింది. బలమైన ఫోర్హ్యాండ్ షాట్లతో చెలరేగుతూ వరుస పాయింట్లు దక్కించుకుంది. ఆదివారం జరిగే ఫైనల్లో జీల్ దేశాయ్తో రష్మిక తలపడుతుంది.