వేములవాడ: వేములవాడలో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు శతజయంతి సందర్భంగా జరిగిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో మహబూబ్నగర్(పురుషుల విభాగం), నల్లగొండ(మహిళల విభాగం) జట్లు విజేతలుగా నిలిచాయి. బుధవారం ఈ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. పురుషుల విభాగంలో పాలమూరు 25-15, 25-21, 25-18 స్కోర్తో హైదరాబాద్ జట్టుపై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది. హైదరాబాద్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
మహిళల విభాగంలో నల్లగొండ జట్టు 18-25, 25-21, 25-20, 25-23 స్కోర్తో రంగారెడ్డి జట్టుపై విజయం సాధించింది. విజేతలకు ఎమ్మెల్యే రమేశ్బాబుతో పాటు జడ్పీ చైర్పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, రాష్ట్ర పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రవీణ్, రాష్ట్ర పశుఘనాభివృద్ధి సంస్థ, కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్రావు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్బాబు కప్లు ప్రశంసాపత్రాలు అందజేశారు.