మహబూబ్నగర్టౌన్, జనవరి 1: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి అండర్-17 బాల, బాలికల హ్యాండ్బాల్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. పోటీలను ప్రారంభించిన మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి.. క్రీడాకారులు ప్రతిభ చాటి జాతీయస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పోటీల్లో ఉమ్మడి జిల్లాల నుంచి పది జట్లు పాల్గొంటున్నాయి.
బాలుర విభాగంలో మహబూబ్నగర్ జట్టు 14-4 గోల్స్ తేడాతో నల్లగొండపై, 15-8తో ఆదిలాబాద్పై గెలిచింది. బాలికల విభాగంలో మహబూబ్నగర్ జట్టు 8-6తో మెదక్పై, 10-9తో హైదరాబాద్పై విజయం సాధించింది. టోర్నీ ఆరంభ కార్యక్రమంలో డీఈవో రవీందర్, కౌన్సిలర్ రష్మిత, ఏఎంవో బాలుయాదవ్, సీఎవో శ్రీనివాస్, ఎస్జీఎఫ్ సెక్రటరీ రమేశ్బాబు తదితరులు పాల్గొన్నారు.