బొడ్రాయిబజార్: సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం నుంచి రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ టోర్నీ మొదలుకానుంది. మూడు రోజుల పాటు స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. పోటీలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ప్రారంభించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 500 మంది ప్లేయర్లు, 36 జట్లు టోర్నీలో పోటీపడుతున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
టోర్నీలో పాల్గొనే ప్లేయర్లు, అధికారులు అందరికీ మంత్రి జగదీశ్రెడ్డి ఆతిథ్యం అందిస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా బాస్కెట్బాల్ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే గాదరి కిషోర్ పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.