హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండోనేషియాలోని బాలీలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ టెస్ట్ సిరీస్ 2025-26 టోర్నీలో రాష్ట్ర గురుకుల విద్యార్థులు సత్తాచాటారు.
ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి రాష్ట్రం నుంచి భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన బాబూ నాయక్ (లింగాల), శశిధర్ (ఉప్పల్వాయి) దేశానికి స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. టోర్నీ ఫైనల్లో భారత్.. 3-0తో ఇండోనేషియాను ఓడించి పసిడి పతకం సాధించింది.