హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర స్థాయి 182వ బ్రిలియంట్ చెస్ టోర్నీలో సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థి రాజ్కుమార్ విజేతగా నిలిచాడు. మొత్తం 12 రౌండ్లకు 10.5 పాయింట్లు దక్కించుకున్న రాజ్కుమార్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఇదే విభాగంలో వంశీ (10), అశిష్ చౌదరి (9.5) వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. బాలికల అండర్-15 విభాగంలో సుప్రియ (9, మహబూబ్బాద్)టాప్-2లో నిలువగా, శరిష్మా (8.5, ధన్వాయిగూడెం) అండర్-13 కేటగిరీలో శ్రీలేఖ (8.5) రెండో స్థానం దక్కించుకుంది. ఓపెన్ విభాగంలో శివకుమార్ 8వ స్థానంలో నిలువగా, అండర్-11 కేటగిరీలో శివాంశిక రెండో స్థానం కైవసం చేసుకుంది.