Duleep Trophy | బెంగళూరు: స్టార్ ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (50 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్ (52) అర్ధసెంచరీలు బాదడంతో సెంట్రల్ జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో వెస్ట్ జోన్ పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సమయానికి వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లకు 149 పరుగులు చేసింది. అంతకుముందు సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్లో 128 పరుగులకే కుప్పకూలింది. ధ్రువ్ జురెల్ (46), రింకూ సింగ్ (48) మినహా తక్కినవాళ్లంతా విఫలమయ్యారు.
అర్జాన్ నాగ్వస్వల్లా 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్న వెస్ట్ జోన్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. పుజారాతో పాటు సర్ఫరాజ్ ఖాన్ (6) క్రీజులో ఉన్నాడు. నార్త్ జోన్, సౌత్ జోన్ మధ్య జరుగుతున్న మరో సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్లో నార్త్ జోన్ 198 రన్స్ చేయగా.. సౌత్ జోన్ 195 పరుగులు సాధించింది. ప్రస్తుతం నార్త్జోన్ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లకు 51 పరుగులు చేసింది.