హైదరాబాద్, ఆట ప్రతినిధి: థాయ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐటీఎఫ్ టెన్నిస్ టోర్నీలో రాష్ట్ర యువ ప్లేయర్ శ్రీవల్లి రష్మిక సత్తాచాటుతున్నది. వైదేహి చౌదరీతో కలిసి రష్మిక టోర్నీలో క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది.
గురువారం జరిగిన మహిళల ప్రిక్వార్టర్స్ పోరులో రష్మిక, వైదేహి జోడీ 6-2, 6-4తో సౌజన్య భవిశెట్టి, దషా ఇవానోవో ద్వయంపై అలవోక విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన పోరులో రష్మిక, వైదేహి అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పోరాడుతూ మ్యాచ్ను కైవసం చేసుకున్నారు.