హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ క్యారమ్స్ టోర్నీలో తెలంగాణకు చెందిన శ్రీనివాస్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల ఫైనల్లో శ్రీనివాస్ 19-25, 25-11, 25-7తో జుగల్ కిషోర్దత్తా(అస్సాం)పై అద్భుత విజయం సాధించాడు. మహిళల విభాగంలో రశ్మి కుమారి(పీఎస్పీబీ) టైటిల్ దక్కించుకుంది. పురుషుల టీమ్ఈవెంట్లో తెలంగాణకు అగ్రస్థానం దక్కగా, మహారాష్ట్ర, విదర్భ రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.