టీ20 వరల్డ్ కప్ 2021లో భాగంగా షార్జాలోని స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంకకు తొలి ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి శ్రీలంకకు 172 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. బ్యాటింగ్ బరిలోకి దిగిన శ్రీలంక.. 6 ఓవర్లలో ఒక వికెట్ను నష్టపోయి 54 పరుగులు చేసింది.
అయితే.. తొలి ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ పెరీరా క్లీన్ బౌల్డయ్యాడు. మూడు బంతుల్లో ఒక పరుగు చేసి పెవిలియన్ బాట పట్టాడు. నసుమ్ వేసిన బంతికి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో నిస్సాంక, చరిత్ అసలంకా ఉన్నారు. నిస్సాంక.. 15 బంతుల్లో 19 పరుగులు చేయగా.. చరిత్ 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు.