సిటీబ్యూరో, మార్చి 15 (నమస్తే తెలంగాణ): సైబర్నేరగాళ్లు తయారు చేసిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఏఐ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన ఓ వృద్ధురాలు స్టాక్స్లో పెట్టుబడి పెట్టి రూ. 87 లక్షలు పోగొట్టుకున్నది. ఓల్డ్బోయిన్పల్లికి చెందిన బాధితురాలు ఏఐ వీడియోను చూసింది. అందులో ఇన్వెస్ట్ చేయాలంటూ సూచన ఉండడంతో నిజమని నమ్మేసి..ఆ వీడియోను క్లిక్ చేసింది. వెంటనే ఆమెకు వాట్సాప్ కాల్స్ రావడం మొదలయ్యాయి.
‘మీరు ట్రేడ్గిప్’ అనే పేరుతో ఉన్న ఫ్లాట్ఫామ్పై పెట్టుబడి పెట్టండి, అందుకు ఐడీ ఫ్రూఫ్, బ్యాంకు అకౌంట్ నంబర్ తీసుకొన్నారు. అకౌంట్ క్రియేట్ చేస్తున్నామంటూ యూజర్ ఐడీ, పాస్వర్డ్ క్రియెట్ చేశారు. దర్శ అనే వ్యక్తి ఫోన్లో మాట్లాడుతూ ‘మీరు ఇన్వెస్ట్ చేస్తే భారీ లాభాలు ఖాయమంటూ నమ్మించి మొదట రూ. 60 వేలు పెట్టుబడి పెట్టించాడు. తర్వాత దఫదఫాలుగా రూ. 87.96 లక్షలు పెట్టుబడి పెట్టించారు. స్క్రీన్పై కన్పిస్తున్న డబ్బును విత్డ్రా చేయకుండా అడ్డుకోవడంతో ఇదంతా మోసమని గుర్తించిన బాధితురాలు.. మల్కాజిగిరి సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.