Srilanka Cricket Board : వరల్డ్ కప్లో శ్రీలంక జట్టు చెత్త ప్రదర్శనకు బలైన క్రికెట్ బోర్డు(Srilanka Cricket Board)కు కోర్టులో భారీ ఊరట లభించింది. బోర్డు సభ్యులు రెండు వారాల పాటు పదవిలో ఉండేందుకు కోర్టు అంగీకరించింది. క్రీడా మంత్రి రోషన్ రణసింఘే(Roshan Ranasinghe) బోర్డును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ అధ్యక్షుడు షమ్మి సిల్వా(Shammi Silva) కోర్టును అశ్రయించారు. దాంతో, 2 వారాల తర్వాత విచారణ చేపడతామని, అప్పటి వరకూ బోర్డు సభ్యులు పదవిలో కొనసాగుతారని న్యాయస్థానం పేర్కొంది.
2011 రన్నరప్ శ్రీలంక(Srilanka) వరుస ఓటములతో సెమీస్ రేసులో వెనకబడి అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ముంబైలో భారత్ చేతిలో 302 పరుగుల తేడాతోఘోర పరాభవానికి గురైంది. ఆ ఓటమిని సీరియస్గా తీసుకున్న లంక ప్రభుత్వం క్రికెట్ బోర్డు సోమవారం సభ్యులందరిపై వేటు వేసింది.
బోర్డు సభ్యులందరినీ తొలగిస్తున్నట్టు సోమవారం క్రీడా శాఖ మంత్రి రోషన్ రణసింఘే వెల్లడించాడు. అంతేకాదు 1996 వరల్డ్ కప్లో శ్రీలంకను చాంపియన్గా నిలిపిన అర్జున రణతుంగ(Arjuna Ranatunga) నేతృత్వంలో కొత్తగా మధ్యంతర కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
5 వికెట్లతో లంకను కూల్చిన షమీ
ముంబైలోని వాంఖడేలో నవంబర్ 2న జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై 302 పరగులు భారీ తేడాతో ఓడింది. సొంత గడ్డపై జరిగిన ఆసియా కప్ ఫైనల్లో50 రన్స్కే ఆలౌటైన శ్రీలంక.. మళ్లీ అదే తడబాటును కనబరిచింది. 357 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 55 పరుగుకలే కుప్పకూలింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా శుభ్మన్ గిల్(92), కోహ్లీ(88), శ్రేయస్ అయ్యర్(82) అర్ధ శతకాలతో కదం తొక్కారు. ఆ తర్వాత షమీ 5 వికెట్లు పడగొట్టడంతో లంక చిత్తుగా ఓడిపోయింది. ఇప్పటికే సెమీస్ రేసు నుంచి వైదొలిగిన మెండిస్ సేన చాంపియన్స్ ట్రోఫీ 2025 బెర్తు కోసం పోరాడనుంది. మెగా టోర్నీలో లంక బెంగళూరులో నవంబర్ 9న న్యూజిలాండ్తో తలపడనుంది.