బెంగుళూరు: న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే వరల్డ్కప్ (ODI Worldcup) మ్యాచ్లో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. కివీస్ బౌలర్లు ఆరంభంలో లంక బ్యాటర్లను దెబ్బతీశారు. శ్రీలంక జట్టులో కుశాల్ పెరిరా శరవేగంగా హాఫ్ సెంచరీ చేయగా, లోయర్ ఆర్డర్లో తీక్షణ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఓ దశలో లంక 113 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్, రవీంద్ర, శాంట్నర్లు రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. చివరి వికెట్కు తీక్షణ, దిల్షాన్ మధ్య 43 రన్స్ భాగస్వామ్యం ఏర్పడింది. తీక్షణ 38 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు.