హైదరాబాద్: వన్ డే ప్రపంచకప్లో భాగంగా పాకిస్థాన్ టీమ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక జోరుగా బ్యాటింగ్ చేస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోర్ 5 పరుగుల వద్ద ఓపెనర్ కుశాల్ పెరీరా డకౌట్ అయ్యాడు. హసన్ అలీ బౌలింగ్లో రిజ్వాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
ఆ తర్వాత ఓపెనర్ పాతుమ్ నిస్సంకకు కుశాల్ మెండిస్ జతచేరి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత నిస్సంక (51; 7 ఫోర్లు, 1 సిక్సర్) షాదాబ్ ఖాన్ బౌలింగ్లో షఫీఖ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికి జట్టు స్కోర్ 17.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 107 పరుగులు. కాగా, 2023 వన్ డే ప్రపంచకప్లో ఇది 8వ మ్యాచ్.