గాలె: ఐర్లాండ్తో జరిగిన రెండో టెస్టులో శ్రీలంక ఇన్నింగ్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోడానికి 212 పరుగులు చేయాల్సిన ఐర్లాండ్ చివరి రోజు శుక్రవారం తమ రెండో ఇన్నింగ్స్లో 202 పరుగులకు ఆలౌటైంది. హారీ టెక్టర్ (85), ఆండ్రూ బాల్బిర్నె (46) రాణించారు.
లంక బౌలర్లలో రమేశ్ మెండిస్ 5 వికెట్లు పడగొట్టాడు. ప్రభాత్ జయసూర్యకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, కుశాల్ మెండిస్కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.