దుబాయ్: బంగ్లాదేశ్తో జరిగిన హోరాహోరీ పోరులో శ్రీలంక 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 7 వికెట్లకు 183 పరుగులు చేసింది. అఫిఫ్ (39), మెహిదీ హసన్ (38) రాణించారు. లంక బౌలర్లలో హసరంగ, చమిక చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లంక 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (37 బంతుల్లో 60; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. కెప్టెన్ షనక (45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.