నల్లగొండ : సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే తెలంగాణాలో అభివృద్ధి జరిగింది. గ్రామాల్లో కులవృత్తులు బాగు పడి వలసలు ఆగి పోయాయాని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
జిల్లాలోని హాలియాలో గీత కార్మికుల సదస్సులో మంత్రులు పాల్గొని మాట్లాడారు. నేడు తెలంగాణలో ఆకలి కేకలు లేవు. ఇదే కేసీఆర్ పాలన గొప్పదనమన్నారు. మ్యానిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసి సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రశంసించారు.
సీఎం కేసీఆర్ పాలన వచ్చాకే సాగర్ ఎడమ కాలువ కింద చివరి భూములకు నీళ్లు అందుతున్నాయని పేర్కొన్నారు సమైక్య పాలనలో గీత కార్మిక వృత్తిని ఆగం చేసిండ్రు. కుట్ర పూరితంగా గీత వృత్తిని కనుమరుగు చేశారని విమర్శించారు.
సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కుల వృత్తులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. రాష్ట్రంలో విరివిగా ఈత, తాటి చెట్లను నాటించారు. జానారెడ్డి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు.
ఇవి కూడా చదవండి..
జొన్నకుప్ప దగ్ధం.. రూ.45వేల నష్టం
ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..!
లారీని ఢీకొట్టిన కారు..వ్యక్తి మృతి
సారీ.. ఆ లోగో ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ వేసుకోలేను: మొయిన్ అలీ