గాలె: టాపార్డర్ రాణించడంతో పాకిస్థాన్తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఆదివారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. దినేశ్ చండిమల్ (80; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. ఒషాడో ఫెర్నాండో (50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ దిముత్ కరుణరత్నె (40), మాథ్యూస్ (42), డిక్వెల్లా (42 బ్యాటింగ్), ధనంజయ (33) తలా కొన్ని పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో నవాజ్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం డిక్వెల్లాతో పాటు దునిత్ (6) క్రీజులో ఉన్నాడు. ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ విజయం సాధించిన విషయం తెలిసిందే.