గాలె: పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్కోరు దిశగా సాగుతున్నది. పాక్ పేసర్లు రాణించడంతో 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన లంక ఆ తర్వాత తేరుకుంది. ఆదివారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి లంక తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. ధనంజయ (94 బ్యాటింగ్; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. మాథ్యూస్ (64), సమరవిక్రమ (36) అతడికి సహకరించారు. షాహీన్ అఫ్రిది 3 వికెట్లు పడగొట్టాడు.