కొలంబొ : ప్రపంచకప్లో శ్రీలంక క్రికెట్ జట్టు నిరాశజనక ప్రదర్శన ఆ దేశ క్రికెట్ బోర్డుకే ముప్పుతెచ్చింది. సెమీస్కు అర్హత కోల్పోవడమేకాక, భారత జట్టు చేతిలో 302 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టును ప్రమాదంలోకి నెట్టింది. జట్టు ప్రదర్శనతో నిరసనలు వెల్లువెత్తడంతో దేశ క్రీడా మంత్రి లంక బోర్డును వివరణ కోరగా, సోమవారం ప్రభుత్వం క్రికెట్ బోర్డును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. లంక జట్టు ప్రదర్శనపై మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమిస్తూ క్రీడామంత్రి రోషన్ రణసింగె ఉత్తర్వులు జారీచేశారు. లంక క్రికెట్ బోర్డు అధ్యక్షుడు షమి సిల్వ పాలనా విధానాలను రణతుంగ మొదటినుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాడు.