కొలంబో: ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంక అదరగొట్టింది. శనివారం జరిగిన పోరులో లంక 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. మొదట లంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 257 పరుగులు చేసింది. సమరవిక్రమ (93), కుషాల్ మెండిస్ (50) రాణించారు. బంగ్లా బౌలర్లలో తస్కీన్, మహమూద్ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో బంగ్లా 48.1 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ (82) పోరాడినా ఫలితం లేకపోయింది. లంక బౌలర్లలో తీక్షణ, షనక, పతిరణ తలా 3 వికెట్లు పడగొట్టారు. సూపర్-4లో వరుసగా రెండో పరాజయం మూటగట్టుకున్న బంగ్లాకు ఫైనల్ దారులు మూసుకుపోయాయి.