హైదరాబాద్ : మొహాలిలో జరుగుతున్న భారత్, శ్రీలంక తొలిటెస్ట్లో శ్రీలంక జట్టు 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన భారత్కు 400 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్లో సత్తా చాటిన రవీంద్ర జడేజా బౌలింగ్లోనూ రాణించి శభాష్ అనిపించుకున్నాడు. జడేజా ఈ మ్యాచ్లో 175 పరుగులు చేసి 5 వికెట్లు తీయడం విశేషం. భారత్ తొలి ఇన్నింగ్స్ను 574 పరుగుల వద్ద 8 వికేట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది.
అనంతరం శ్రీలంక జట్టు బ్యాటింగ్ చేపట్టింది. అశ్విన్, బుమ్రాకు రెండేసి వికెట్లు పడగొట్టగా షమీకి ఒక వికెట్ దక్కింది. భారత్ జట్టులో పంత్ 96, అశ్విన్ 61 పరుగులు చేయగా విహారి 58, వంద టెస్టు ఆడుతున్న కోహ్లీ 45 పరుగులు చేసిన విషయం తెలిసిందే.