SRHvs PBKS | వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని అందుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ను ఓడించింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ను మొదట్నుంచే సన్రైజర్స్ కట్టడి చేసింది. దీంతో స్వల్ప వ్యవధిలోనే పంజాబ్ నాలుగు వికెట్లను చేజార్చుకుంది. ఓపెనర్లు శిఖర్ ధవన్ (8), ప్రభ్మన్ సింగ్(14), బెయిర్ స్టో (12) విఫలమయ్యారు. జితేశ్ శర్మ కూడా ఆకట్టుకోలేకపోయారు. స్వల్ప పరుగులతో కష్టాల్లో ఉన్న పంజాబ్ను లివింగ్ స్టోన్ (60) షారుఖ్ ఖాన్ (26) ఆదుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 151 పరుగులు చేయగలిగింది.
152 పరుగుల మోస్తరు లక్ష్యంతో దిగిన సన్రైజర్స్ చెలరేగింది. కేన్ విలియమ్సన్ (3) విఫలమైనప్పటికీ మార్క్రమ్ (41), నికోలస్ పూరన్ (35), రాహుల్ త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31) రాణించారు. దీంతో 18.5 ఓవర్లలోనే పంజాబ్ నిర్దేశించిన టార్గెట్ను హైదరాబాద్ చేధించింది. దీంతో వరుసగా నాలుగో మ్యాచ్ గెలిచి పాయింట్ల పట్టికలో టాప్ 4 స్థానానికి ఎగబాకింది.