లక్నోతోపై గెలిచేందుకు సన్రైజర్స్ జట్టు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఆరంభంలోనే కెప్టెన్ కేన్ విలియమ్సన్ (16) వికెట్ కోల్పోయిన సన్రైజర్స్.. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (13) వికెట్ కూడా కోల్పోయింది. ఇలాంటి సమయంలో యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ (44) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు.
అవకాశం దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును నిలబెట్టాడు. అతనికి ఎయిడెన్ మార్క్రమ్ (12) కాసేపు సహకారం అందించాడు. కానీ అతను అవుటైన కాసేపటికే త్రిపాఠీ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో నికోలస్ పూర్ (21 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (6 నాటౌట్) ఉన్నారు. 15 ఓవర్లకు సన్రైజర్స్ 120/4 స్కోరుతో నిలిచింది.