చెన్నై సూపర్ కింగ్స్పై అన్ని విభాగాల్లో రాణించి ఈ ఐపీఎల్లో తొలి విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. బలమైన గుజరాత్ టైటాన్స్తో పోటీకి సిద్ధమైంది. ఇప్పటి వరకు టోర్నీలో అపజయం ఎరుగని గుజరాత్ను సన్రైజర్స్ ఓడిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. బౌలింగ్ ఎంచుకున్నాడు.
తర్వాత మంచు ప్రభావంతోపాటు బౌలింగ్ నైపుణ్యాలను ముందుగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నామని, అందుకే ఫీల్డింగ్ ఎంచుకున్నామని కేన్ విలియమ్సన్ చెప్పాడు. తాను టాస్ గెలిచి ఉన్నా బౌలింగే ఎంచుకునేవాడినని హార్దిక్ పాండ్యా కూడా అన్నాడు. రెండు జట్లు కూడా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నాయి.
గుజరాత్ టైటన్స్: మాథ్యూ వేడ్, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, దర్శన్ నల్కండే, మహమ్మద్ షమీ, లోకీ ఫెర్గూసన్
సన్రైజర్స్ హైదరాబాద్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠీ, ఎయిడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, షషాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్
Kane Williamson wins the toss and elects to bowl first against #GujaratTitans
Live – https://t.co/phXicAbLCE #SRHvGT #TATAIPL pic.twitter.com/n1IaC2omhM
— IndianPremierLeague (@IPL) April 11, 2022